నిజాయితీ తెలివి తక్కువ తనం అయిపోతుంది,మోసం తెలివి అవుతుంది.మాయ మాటలకు, అబద్ధాలకు గౌరవం పెరుగుతుంది, నిజానికి,నిష్కపటానికి ఆదరణ తరిగిపోతుంది, ముంచడానికి పొగిడే వాడికి పట్టం కడుతున్నారు,మంచి కోరి కఠినంగా మాట్లాడే వాడిని పక్కన పెడుతున్నారు,విచ్చలవిడిగా బతికేవాడికి సంపదలు, సన్మానాలు,
విచక్షణ తో బతికే వాడికి సమస్యలు, అవమానాలు ఇవే కలికాలపు వైపరీత్యాలు, నువ్వు నడిచే దారిలో ధర్మం ఉన్నప్పుడు నువ్వు దేని కోసం, ఎవరి కోసం మారాల్సిన అవసరం లేదు.
©చిరంజీవి మాచర్ల.